తండ్రి మరణించడంతో కేరళ నుండి ఢిల్లీ వెళ్లిన బాలీవుడ్ యాక్టర్
on Oct 3, 2021
బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్పాయ్ తండ్రి ఆర్.కె. బాజ్పాయ్ నేటి ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. అనారోగ్య సమస్యలతో సమతమవుతున్న తండ్రిని రెండు వారాల క్రితం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు మనోజ్. అప్పట్నుంచీ ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం ఆర్.కె. బాజ్పాయ్ తుది శ్వాస విడిచారు.
తండ్రి మరణంతో మనోజ్ బాజ్పాయ్ హుటాహుటిన కేరళ నుండి ఢిల్లీ ప్రయాణం అయ్యారు. కొన్ని రోజులుగా కేరళలో ఓ సినిమా చిత్రీకరణలో మనోజ్ పాల్గొంటున్నారు. తండ్రిని ఆసుపత్రిలో చేర్పించి సమయంలో ఢిల్లీ వెళ్లి... మళ్లీ కేరళ వచ్చేశారట. తన ఒక్కడి వల్ల చిత్రీకరణకు అంతరాయం ఏర్పడకూడదని ఆయన ఆ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పుడు తండ్రి మరణంతో వెంటనే ఢిల్లీ వెళ్లారు.
మనోజ్ స్వస్థలం బీహార్. నటన మీద ఆసక్తితో ఢిల్లీ వచ్చి థియేటర్ స్కూల్ లో చేరారు. సినిమాల్లో వేషాల కోసం ముంబై ట్రైన్ ఎక్కారు. ఆయన తల్లిదండ్రులు మాత్రం ఢిల్లీలో ఉన్నట్లు బాలీవుడ్ టాక్.
Also Read